Monday, August 18, 2025
spot_img

రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ వ్యాఖ్యలు : నాగార్జున

Must Read

సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమె పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో నేడు తన సతీమణి అమల, కుమారుడు నాగచైత్యన్యతో కలిసి నాగార్జున నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని, తమ మర్యాదలకు భంగం కలిగిందని కోర్టుకు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నపించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‎మెంట్ ను కోర్టు రికార్డ్ చేసింది.

Latest News

సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమాజంలోని ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు స్ఫూర్తి గా తీసుకని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS