Friday, October 3, 2025
spot_img

గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్

Must Read

తెలంగాణలో గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 01 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. 08 మంది పిటీషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులో పడటం ఏమిటని ప్రశ్నించింది.

ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్ 01 పరీక్షకు హాజరవుతున్నారు. గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం హైదరాబాద్ లో 08, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజ్‎గిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 01:30 తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని, ప్రతి పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This