Thursday, July 3, 2025
spot_img

గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్

Must Read

తెలంగాణలో గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 01 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. 08 మంది పిటీషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులో పడటం ఏమిటని ప్రశ్నించింది.

ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్ 01 పరీక్షకు హాజరవుతున్నారు. గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం హైదరాబాద్ లో 08, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజ్‎గిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 01:30 తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని, ప్రతి పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS