Monday, August 18, 2025
spot_img

పాకిస్థాన్‎లో ఉగ్రవాద శిక్షణ శిబిరం, కనిపెట్టిన భారత ఇంటిలిజెన్స్

Must Read

పాకిస్థాన్ ఆబోటాబాద్‎లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్‎ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే ఓ మెగా టెర్రర్ క్యాంప్‎ను ఏర్పాటు చేశాయని తెలిపింది. ఈ క్యాంప్ లోకి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు అడుగుపెట్టడం అంత సులభం కాదని వెల్లడించింది.

ఇక్కడ యువకులు,యువతులకు ఆయుధ వినియోగంతో పాటు ఇతర ఉగ్ర కార్యకాలపాల్లో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఆబోటాబాద్‎లోని ఓ సేఫ్ హౌస్‎లోనే అల్‎ఖైదా ఉగ్ర సంస్థ నాయకుడు బిన్ లాడెన్ దాకున్నాడు. 2011లో మే నెలలో అమెరికా కమాండోలు రహస్యంగా హెలికాప్టర్ లో ఇక్కడికి చేరుకొని లాడెన్‎ను చంపివేయడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది.

ఈ ప్రదేశంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

Latest News

స్పా సెంటర్లపై రాచకొండ పోలీసుల దాడులు

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని ఎనిమిది స్పా సెంటర్లపై రాత్రి ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS