Tuesday, August 19, 2025
spot_img

వెంకయ్యతో టీటీడీ ఛైర్మన్ భేటీ

Must Read
  • మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన బీఆర్ నాయుడు
  • హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి సమావేశం
  • తితిదే ఛైర్మన్ గా నియామకమైనందుకు మర్యాద పూర్వక భేటీ
  • బీఆర్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన వెంక‌య్య‌

టీటీడీ కొత్త ఛైర్మన్ గా నియామకం అయిన బీఆర్ నాయుడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ నూతన ఛైర్మన్‌గా టీవీ 5 న్యూస్ ఛానల్ ఛైర్మన్‌ బాలినేని రాజగోపాల్ నాయుడు నియమితులైన సంగతి తెలిసిందే. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్ గా నియమితులైన బీఆర్‌ నాయుడు.. వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. కాసేపు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమితులైన సందర్భంగా బీఆర్ నాయుడుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS