Sunday, July 13, 2025
spot_img

ఛత్తీస్‎గఢ్‎లో మరోసారి ఎన్‎కౌంటర్, మావోయిస్టు మృతి

Must Read

ఛత్తీస్‎గఢ్‎లో మరోసారి భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది. బుధవారం బీజాపూర్ జిల్లా గంగ్లూరు పోలీస్‎స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఎన్‎కౌంటర్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‎కౌంటర్‎లో ఒక మావోయిస్టు మరణించాడు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. ముంగా గ్రామంలో మావోయిస్టులు భేటీ అయ్యారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రత బలగాలు , మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది.

ఘటన స్థలం నుండి 09 ఎంఎం పిస్టల్‎తో పాటు, మావోయిస్టులకు సంబంధించిన ఇతర వస్తువులను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS