Saturday, July 12, 2025
spot_img

దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పోరాడాలి

Must Read
  • 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా కేంద్ర బడ్జెట్
  • మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తోలి బడ్జెట్ ప్రవేశపెడ్తున్నాం
  • ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాం
  • కొత్త ఎంపీలకు అవకాశం ఇవ్వాలి
  • పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ

2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు ప్రధాని మోదీ.సోమవారం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.మంగళవారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.ఈ సందర్బంగా పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.భారత దేశ ప్రజల స్వప్నాలని సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని తెలిపారు.మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళవారం తోలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.ఎన్నికల్లో అన్నీ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి,దేశ అభివృద్ధి కోసం అందరు కలిసి పోరాడాల్సిన అవసరముందని అన్నారు.పార్లమెంట్ సమావేశాల్లో కొత్త ఎంపీలకు అవకాశమివ్వాలని ప్రధాని మోదీ కోరారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS