Thursday, February 13, 2025
spot_img

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన ఉండాలి – షర్మిల

Must Read

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.
ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది అని APCC ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు

Latest News

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS