Sunday, May 18, 2025
spot_img

సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు

Must Read

పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా. తీన్మార్ మల్లన్న నన్ను శంకిని అని మాట్లాడుతున్నాడు.. నేను ఇదే TSPSC సమస్యల మీద గత ప్రభుత్వం ఉన్నపుడు కూడా వచ్చి మాట్లాడాను.. ఆరోజు నేను శంకిని లాగా కనపడలేదా. BRS ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొట్లాడినం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను కొన్నారా.. అప్పుడు నన్ను ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదు. నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు నేను ఏ పార్టీ కండువా అయినా కప్పుకున్నట్లు ఎవరైనా నిరుపించగలరా. ఒక ఆడ బిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సమంజసం. ఆరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మేము ఎక్కడుంటే అక్కడిక వచ్చి మమ్మల్ని నమ్మండి అంటూ BRS ప్రభుత్వం కంటే మంచిగా చేస్తాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకొని మోసం చేశారు. ఆరోజు AICC నేతలను కల్సినం, ప్రొఫెసర్ కోదండరాం చెప్పిన ప్రకారమే చేసినం.. అప్పుడు మమ్మల్ని ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS