Wednesday, October 22, 2025
spot_img

తెలంగాణను వణికిస్తున్న చలి

Must Read

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కంటే కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అదిలాబాద్ జిల్లా బేలలో 09.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగడానికి కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది.గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు దారుణంగా పడిపోయాయి. రాత్రి సమయంలో చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This