Thursday, July 3, 2025
spot_img

రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ వ్యాఖ్యలు : నాగార్జున

Must Read

సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమె పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో నేడు తన సతీమణి అమల, కుమారుడు నాగచైత్యన్యతో కలిసి నాగార్జున నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని, తమ మర్యాదలకు భంగం కలిగిందని కోర్టుకు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నపించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‎మెంట్ ను కోర్టు రికార్డ్ చేసింది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS