Friday, October 3, 2025
spot_img

రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ వ్యాఖ్యలు : నాగార్జున

Must Read

సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమె పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో నేడు తన సతీమణి అమల, కుమారుడు నాగచైత్యన్యతో కలిసి నాగార్జున నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని, తమ మర్యాదలకు భంగం కలిగిందని కోర్టుకు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నపించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‎మెంట్ ను కోర్టు రికార్డ్ చేసింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This