Saturday, October 4, 2025
spot_img

ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై సంయమనం పాటించాలి

Must Read
  • డీజీపీ జితేందర్

గ్రూప్ 01 మెయిన్స్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నిరసన పేరుతో ఎవరైనా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై సంయమనం పాటించాలని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This