Sunday, January 26, 2025
spot_img

పార్లమెంట్‎లో విపక్షాల రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా

Must Read

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది.
గౌతం ఆదానీ అవినీతి, సంభాల్‎లో చెలరేగిన హింస తదితర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షలు పట్టుబట్టడంతో ఉభయ సభల సమావేశాలకు అంతరాయం కలుగుతుంది. సోమవారం కూడా పార్లమెంట్ లో ఇదే పరిస్థితి కొనసాగింది.

సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదానీ, సంభాల్‎లో జరిగిన హింసాకాండపై చర్చకు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్‎సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‎ఖర్ ప్రకటించారు. తిరిగి సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు మళ్లీ నిరసన తెలిపాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్‎సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలను రేపటికి వాయిదా పడ్డాయి.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS