Monday, August 18, 2025
spot_img

పాత్రికేయులకు రైల్వే పాసులు పునరుద్ధరించండి

Must Read
  • ఎంపీ పురందేశ్వరికి నిమ్మరాజు వినతి

కరోనా కష్టసమయంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు,ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు.రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేసి ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సరైన ఆదాయ వనరులు లేక రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పత్రికలు కొట్టుమిట్టాడుతున్నాయని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.చిన్న,మధ్య తరహా పత్రికల మనుగడ కోసం ముఖ్యమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసేలా చూడాలని ఎంపీ పురందేశ్వరిని నిమ్మరాజు విజ్ఞప్తి చేశారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS