Sunday, May 18, 2025
spot_img

మాజీ సీఎం కేసీఆర్ మీద ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Must Read

గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని.. ఈ విషయం ఇంకా బయటికి రాలేందంటూ చెప్పుకొచ్చారు. తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు!
మెదక్‌లో జరిగిన విజయోత్సవ ర్యాలీ, సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు ఈ మేరకు కామెంట్స్ చేశారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని, రఘునందన్ అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అంటూ చెప్పుకొచ్చారు. పైసలు, మందు ఓపెన్‌గా పంచినా మిగితా పార్టీల నేతలు ఓడిపోయారని ఎన్నికలను ప్రస్తావించారు. వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచానని రఘునందన్ రావు తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS