- ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి
రాష్ట్రంలో త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత, ఏపీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి, రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో గ*జాయిను నిర్మూలించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
జగన్ భద్రత తగ్గించలేదు :
మాజీ ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ భద్రతను తమ ప్రభుత్వం తగ్గించలేదని, అనవసరంగా అయిన రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల కొరత ఉంటే జగన్ కి 900 మందితో భద్రత కావాలా అని ప్రశ్నించారు.