Friday, July 4, 2025
spot_img

యూ.జి.సి పే స్కేల్స్ అమలుపర్చే విధంగా చర్యలు తీసుకుంటాం

Must Read
  • ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూ.జి.సి పే స్కేల్స్ అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిను కోరారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి, వేతనాల చెల్లింపు, అకాడమిక్ పరిస్థితి తదితర అంశాలపై ఆకునూరి మురళి అధ్యాపకులతో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సంధర్బంగా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న అనేక సమస్యలను వారు చర్చించారు. ప్రభుత్వం దృష్టికి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను తీసుకెళ్లి యూజీసీ పే స్కేల్స్ అమలుపర్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఆకునూరి మురళికు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధర్మ తేజ, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ సిహెచ్ వెంకటేష్, డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ సురేష్ నాయక్, డాక్టర్ శివ రెడ్డి, డాక్టర్ అశోక్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS