Friday, October 3, 2025
spot_img

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Must Read
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‎లో హిందూ దేవాలయలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని అయిన పరిశీలించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, కొంతమంది మతోన్మాద శక్తులు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పండుగల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్ పెడితే ఇబ్బంది పెట్టె పోలీసులు, నగరంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This