Friday, October 3, 2025
spot_img

ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు

Must Read

తమిళనాడు-తీరుపూర్ కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవడంతో, పెళ్లి సంబంధం కోసమని ఓ వెబ్ సైట్ ని ఆశ్రయించాడు.సంధ్య అనే మహిళాతో పరిచయం ఏర్పడడంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు.కొన్ని రోజులపాటు వారిద్దరి మధ్య కాపురం సాఫీగా సాగింది.03 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన ఆ యువకుడు అనుమానంతో సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయడంతో సంధ్య బండారం మొత్తం బట్టబయలైంది.ఆధార్ కార్డులో భర్త పేరు వేరే ఉండడంతో పోలీసులను ఆశ్రయించాడు.విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.సంధ్య ఇప్పటికే ఒక డీఎస్పీ,ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి,కరూర్‌లో ఫైనాన్స్ అధికారితో పాటు 50 మందిని పెళ్లిచేసుకుందని పోలీసులు తెలిపారు.కేవలం డబ్బు,నగల కోసమే 50 మందిని పెళ్లి చేసుకుందని పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This