- ఇన్నేళ్ళ చరిత్రలో కిస్మత్రెడ్డి తెలంగాణకు చేసిందేమిటీ ?
- మీలాగ రాహస్య ప్రేమను నడపడం మా పార్టీకి అలవాటులేదు
- గత జన్మలో కిషన్, అసద్ అన్నదమ్ములు అనుకుంటా
- కులం మతం రాజకీయాలకు కాలం చెల్లింది
- మూసీ పై కాదు ముందు సబర్మతి గురించి మాట్లాడండి
- బండి సంజయ్ భాష ఎలాంటిదో అందరికీ తెలుసు
- బీజేపీ నేతల పై విరుచుకుపడ్డ మహేష్ గౌడ్
ఇన్నేళ్ళ పాటు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షునిగా పనిచేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలియాస్ కిస్మత్ రెడ్డి అసలు తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంపీగా అంబర్ పేట నియోజకవర్గానికి అయన ఎం చేశారు అని నిలదీశారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం వారి పగటి కల అని, నిధుల సంగతి దేవుడురేగు ప్రధానిని కలిసి రాష్ట్ర అభివ్రుది ఒక్కసారైనా మాట్లాడారా అంటూ ద్వజమెత్తారు. ఎన్నికలు రాగానే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రేమ చిగురించడం పరిపాటిగా మారిందని, తిరిగి ఎన్నికలు అయిపోగానే బద్ద శత్రువుల్లా బీజేపి బీఆర్ఎస్ నేతల డ్రామాలు అడుతున్నారని దుయ్యబట్టారు. మేము మీలాగా రహస్య ప్రేమను నడపడం మాకు మా పార్టీకి అలవాటు లేదన్నారు. కిషన్ రెడ్డి పొద్దున లేస్తే అక్బర్ ఉద్దీన్ ఓవైసీ జపం చేస్తారని, గత జన్మలో ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు మతం తప్ప అభివృద్ధి పై ధ్యాస లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రజాకార్ల రాజ్యం ఎందుకు వస్తుందో కిస్మత్ రెడ్డికి తెలియాలని అన్నారు. కేంద్ర మంత్రిగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, సన్నబియ్యం లాంటి చారిత్రాత్మక నిర్ణయాలను తెలంగాణలో అమలు చేస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పంపిణీని చేసి అక్కడ మోదీ ఫోటో వేసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదో ముందు చెప్పాలని నిలదీశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో రహస్య ఒప్పందం నిజంకాదా అనే విషయంలో కిషన్రెడ్డి స్పష్టత ఇవ్వాలన్నారు. సంఖ్యాబలం లేని మీరు ఎవరి ప్రేమ అండదండలు చూసుకుని పోటీ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. మాకు సంఖ్యా బలం లేదు కాబట్టే ఎన్నికలకు దూరంగా ఉన్నామని, రాజకీయ అవసరాల బట్టి లోకల్ బాడి ఎన్నికల్లో మద్దతు గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. కులం మతం రాజకీయాలకు కాలం చెల్లిందని, ఎవరికి తొత్తుగా ఉండాల్సిన అవసరం మాకు లేదు కాబట్టే మేము గత అసెంబ్లీ, లోక్సభ, ఎన్నికల్లో పోటీ చేసి గెలిచామని వివరించారు.
మూసీ గురించి మాట్లాడే బీజేపి నేతలు సబర్మతి నది గురించి ఎందుకు మాట్లాడరని అడిగారు. మెట్రో రైలు విస్తరణ పై మీకు బాధ్యత లేదా, నగర ఎంపీగా సహాయ సహకారాలు అందించాల్సిన మీరు దాని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం మేము మా సీఎం, మంత్రులు ప్రధానిని కలవడానికి వస్తారు మరి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. హేెచ్సీయూ భూముల్లో పారిశ్రామిక ప్రగతి అభివృద్ది జరిగితే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, రాజకీయాలు పక్కన పెట్టీ రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఇలా అడుగడుగునా అడ్డుపడడానికి కిషన్ రెడ్డికి సిగ్గుండాలంటూ ద్వజమెత్తారు. డిల్లీలో బీసీల పక్షాన ధర్నాకు చేపడితే హాజరుకాని వారి గురించి మాట్లాడడానికి బీజేపీ నేతలకు అర్హత లేదన్నారు. బీసీ బిడ్డలైన ఈటల రాజేందర్, బండి సంజయ్ బీసీల 42 శాతం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. మజ్లిస్ పార్టీని అడ్డుగా పెట్టుకుని మతం పేరుతో రాజకీయ స్టంట్లు చేయడం మీకు మీ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దిగజారుడు వ్యాఖ్యలకి నేను వ్యతిరేకమని, బండి సంజయ్ లాంటి వ్యక్తి కేంద్రమంత్రి వుంటూ ఆయన మాట్లాడే భాష అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఎవ్వరపైన అయిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలానా వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ సీయనిర్ నాయకులు జానారెడ్డి అనలేదని, రాజకీయ సమతుల్యం ఉండాలని జానారెడ్డి హితం కోరే వ్యక్తి అంటూ చెపుకొచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీ చంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.