Friday, July 4, 2025
spot_img

షాపు కూల్చివేతపై మహిళ ఆందోళన

Must Read
  • పెట్రోల్‌ బాటిల్‌తో రోడ్డుపై బైఠాయింపు

కల్యాణపురి వద్ద గత 20 ఏళ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని నడుపుతోంది. అయితే తమ షాపును జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్‌ బాటిల్‌ పట్టుకుని జీహెచ్‌ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. మరో వైపు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ రోడ్డులో శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్‌ పాయింట్స్‌. అక్రమ హోర్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలకు దిగింది. అలాగే శంషాబాద్‌లోని సిద్ధాంతి జాతీయ రహదారి ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంప్‌ ప్రాంతంలోని హోర్డింగ్‌లను తొలగించడానికి హైడ్రా సిబ్బందితో సహా ఇక్కడికి వచ్చి పరిశీలన జరుపుతోంది. మరికొద్ది సేపట్లో కూల్చివేతల ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS