Sunday, September 7, 2025
spot_img

85 లక్షలు విలువ గల పొడి గ‌*జాయి స్వాధీనం

Must Read
  • 243 కేజీల గ‌*జాయిని స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు.
  • ఒడిషా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా..
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

శామీర్‎పేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా పొడి గ‌*జాయి లభ్యమైంది. ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు పొడి గ‌*జాయిని రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సైబరాబాద్ బాలానగర్ ఎస్.ఓ.టీ బృందం, శామీర్‎పేట్ పోలీసులతో కలిసి ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీ.ఎస్.08 టీ 3206 గల బులెరో పికప్ వాహనాన్ని తనిఖీ చేయగా రూ.85,05,000 విలువ చేసే 243 కేజీల గ‌*జాయి లభించింది.

గ‌*జాయిని తరలిస్తున్న బజరంగ్ (23), గజేందర్ సింగ్ (26), నరేష్ కుమార్ చింగ్లా(40), కపిల్ శర్మ (28 ) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.70,000 విలువ చేసే 07 మొబైల్ ఫోన్లను, బులెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పెట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This