Wednesday, October 22, 2025
spot_img

కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర పోస్ట్

Must Read

తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. సరిగ్గా ఇదే రోజు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సంధర్బంగా అయిన ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

” పోరాటాలను, ఉద్యమాలను, త్యాగలను, ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను..అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి..డిసెంబర్ 07,2023 నాడు..తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.తన వారసత్వాన్ని సగర్వంగా..సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాద్యతను అప్పగించింది.

ఆ క్షణం నుండి.. జన సేవకుడిగా.. ప్రజా సంక్షేమ శ్రామికుడిగా.. మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో.. సకల జనహితమే పరమావధిగా.. జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా.. సహచారుల సహకారంతో.. జనహితుల ప్రోత్సాహంతో.. విమర్శలను సహిస్తూ.. విద్వేషాలను ఎదురిస్తూ.. స్వేచ్ఛకు రెక్కలు తొడిగి.. ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి.. ఆపనిపై అగ్ర భాగాన.. తెలంగాణను నిలిపేందుకు.. గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ.. నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ.. నిరంతరం జ్వలించే..ఈ మట్టి చైతన్యమే స్పూర్తిగా.. విరామం ఎరుగక..విశ్రాంతి కొరక..ముందుకు సాగిపోతున్నారు. ఏడాది ప్రజాపాలనలో ఎంతో అసంతృప్తి..సమస్త ఆకాంక్షలను..సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి” అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This