Friday, July 4, 2025
spot_img

బాల్క సుమన్ తో పాటు 11 మంది నాయకులపై కేసు నమోదు

Must Read

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిల పై పోచారం శ్రీనివాస్ తో కలిసి రేవంత్ రెడ్డి చర్చించారు.ఆ తర్వాత తనయుడుతో కలిసి పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్,మన్నే గోవర్ధన్,గేల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరికొంతమంది నాయకులు నిరసన తెలుపుతూ పోచారం శ్రీనివాస్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.బాల్క సుమన్,గేల్లు శ్రీనివాస్ యాదవ్,మన్నే గోవర్ధన్,ఆంజనేయ గౌడ్,కడారి స్వామి యాదవ్, బాలు,రాజు,జంగయ్య ,వాసు,దశరథ్,బాలరాజు యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతరం కోర్టులో హాజరుపరిచారు.కోర్టుకి తరలిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

Latest News

పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రావొచ్చు

భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి 2025 ఆసియా హాకీ టోర్నమెంట్‌కు భారత్‌(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 7న ముగుస్తుంది. భారత్‌లోని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS