Monday, May 19, 2025
spot_img

బోనాల జాతర పాట ఆవిష్కరణ

Must Read

గురువారం సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాతర పాట – 2024 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.అనంతరం స్క్రీన్ ద్వారా పాటను మంత్రులు వీక్షించారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని మంత్రులు పేర్కొన్నారు.ఈ సందర్బంగా సుపధ క్రియేషన్స్ బృందానికి అభినందనలు తెలియజేశారు.పాటకు సహకరించిన వివిధ రంగాల కళాకారులకు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్ ఐఏఎస్ దేవాదాయ శాఖ సెక్రటరీ హన్మంతరావు,సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నేత వెలిచాల రాజేందర్ రావు,పొన్నం రవిచంద్ర,ఏ.చందర్ తదితరులు పాల్గొన్నారు. బోనాల జాతర పాటకు ఎం.ఎం శ్రీలేఖ సంగీతాన్ని అందించారు.కీర్తన శర్మ ఈ పాటను పాడగా,తంగెళ్ల శ్రీదేవి రెడ్డి లిరిక్స్ రాశారు.చేతన్ కత్తి ఈ పాటకు దర్శకత్వం వహించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS