Saturday, October 4, 2025
spot_img

సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పాయం పాదయాత్ర

Must Read

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధి లో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు.మున్సిపాలిటీ పరిధి లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని పాయం అన్నారు.. గత పదేళ్లుగా మున్సిపాలిటీ లో పాలక వర్గ ఎన్నికల నిర్వహణ లేదని మున్సిపాలిటీ అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మణుగూరు మున్సిపాలిటీ గా రూపాంతరం చెందిన తరవాత ఇక్కడ గిరిజనేతరులు నివసించడానికి ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదని.కొనుగోలు చేసిన వారి పేరు మీద ఇంటి పనులు ఇవ్వటం లేదని,మున్సిపాలిటీ రద్దు చేసి పంచాయతీ గా మార్చాలని పాయం ను ప్రజలు కోరుతున్నారు.ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ మున్సిపాలిటీ లో నెలకోన్న అన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.అంతే కాకుండా ప్రతి అధికారి ప్రజలకు సేవ చేయాలని,వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This