Friday, July 4, 2025
spot_img

యాదవ మహాసభ మహిళా అధ్యక్షురాలిగా బొంతు శ్రీదేవి

Must Read

అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్,జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్ సమక్షంలో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా బొంతు శ్రీదేవి యాదవ్ ని నియమిస్తూ మంగళవారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ,పెద్దల అదేశాల మేరకు తనపై ఉంచిన గురుతర బాధ్యతలకు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు.రాష్త్రం అంతట పర్యటించి మహిళ విభాగం కమిటిలను పునః నిర్మిస్తామని తెలిపారు.యాదవ మహిళలను రాజకీయంగా,విద్యా పరంగా చైతన్య పరుస్తానని తెలిపారు.తన నియామకానికి కృషి చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్,జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్,ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్,బాల మల్లేష్ యాదవ్,కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్,కార్యదర్శి దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్,గ్రేటర్ అధ్యక్షులు మైల్ కొల్ మహేందర్ యాదవ్,యువజన అధ్యక్షులు గొర్ల యశ్వంత్ యాదవ్,విజయ్ యాదవ్,సంతోష్ యాదవ్,మహేందర్ యాదవ్,రాష్ట్ర ఉపాధ్యక్షులుకు,ప్రధాన కార్యదర్శులకు, ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS