Saturday, October 4, 2025
spot_img

రాంనగర్ లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన హైడ్రా

Must Read

హైదరాబాద్ లోని రాంనగర్ లో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది.మణేమ్మ కాలనిలో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ కొనసాగిస్తున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం రంగనాథ్ ఆ స్థలాన్ని పరిశీలించారు.దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్మాణం అక్రమమే అని నిర్ధారణ కావడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This