Saturday, October 4, 2025
spot_img

స్కిల్ యూనివర్శిటీకి రూ.100 కోట్ల విరాళం అందించిన ఆదాని గ్రూప్

Must Read

విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మద్దతు ఉంటుందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు కూడా ఉన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This