Sunday, June 8, 2025
spot_img

అధికారం పోయిన భారాస నాయకులకు అహంకారం తగ్గలేదు

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

భారాస పార్టీ నేతలకు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ, పేదలను కాంగ్రెస్ పార్టీ అదుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందాని, కేటీఆర్ ఫిరంగి నాళాలను ఆక్రమించి ఫాంహౌజ్ లు కట్టారని విమర్శించారు. హైడ్రాను చూసి చెరువులను, నాళాలను ఆక్రమించుకున్న వారు భయపడుతున్నారని అన్నారు. పేదలకు మేలు జరుగుతుంటే కేటీఆర్, హరీష్‎రావు చూసి ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యనించారు.

కులాలను,మతాలను ఏకం చేయడానికే రాజీవ్ సద్భావనా యాత్ర ఏర్పాటు చేశామని తెలిపారు. పేదలను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుందాని, ఎస్సీ, ఎస్టీలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశాన్ని సమగ్రంగా ఉంచేందుకు ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారని తెలిపారు. నియంత పాలనను గద్దె దింపడం కోసం మాజీమంత్రి గీతారెడ్డి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS