Tuesday, October 21, 2025
spot_img

అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదు

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

కిరాయి గుండాలతో అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తాము చేసి చూపిస్తుంటే కిరాయి గుండాలతో, కుట్రలతో అభివృద్దిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రస్తుతం ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఈ అప్పులకు వడ్డీలు కట్టేందుకే వేల కోట్లు పోతున్నాయని తెలిపారు.

కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి కెసిఆర్ కు పదేళ్ళు చేతులు రాలేదని వ్యాఖ్యనించారు. అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కు చేతులు రాలేదని వ్యాఖ్యనించారు. అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ లు కూడా రావని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This