Friday, February 14, 2025
spot_img

రేపటికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ

Must Read
  • ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం
  • రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ
  • ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు
  • రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ

టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.మొత్తంగా 172 మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు.ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు.మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది.రేపు ఉదయం 10:30 గంటలకు
అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.మిగిలిన ఎమ్మెల్యేలు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది.

Latest News

దుర్గమ్మ దారి వెంట దుర్గంధం

ఏడుపాయల్లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారీతి రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్‌ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు భరించలేక భక్తుల ఇబ్బంది ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS