Tuesday, July 15, 2025
spot_img

అధికారులు నిద్రపోతున్నారా..? మాగనూర్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం

Must Read

మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తుందని తెలిపారు. వారం వ్యవధిలో భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యనించింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శమని పేర్కొంది.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS