Monday, August 18, 2025
spot_img

అభివృద్దికి బీఆర్ఎస్ అడ్డుపడుతుంది

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలనే కాదు..వేములవాడ రాజన్నని సైతం మాజీ సీఎం కెసిఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. బుధవారం వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ అభివృద్దికి అడ్డుపడుతుందని మండిపడ్డారు. లగచర్లలో కొందరిని ఉసిగొల్పి కలెక్టర్, అధికారులపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడంగల్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేస్తే రౌడీ మూకలను ఉసిగొల్పి అధికారులను కొట్టరాని మండిపడ్డారు.

కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు, కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS