Friday, July 4, 2025
spot_img

అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదు

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

కిరాయి గుండాలతో అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తాము చేసి చూపిస్తుంటే కిరాయి గుండాలతో, కుట్రలతో అభివృద్దిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రస్తుతం ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఈ అప్పులకు వడ్డీలు కట్టేందుకే వేల కోట్లు పోతున్నాయని తెలిపారు.

కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి కెసిఆర్ కు పదేళ్ళు చేతులు రాలేదని వ్యాఖ్యనించారు. అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కు చేతులు రాలేదని వ్యాఖ్యనించారు. అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ లు కూడా రావని తెలిపారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS