Monday, May 19, 2025
spot_img

పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలి

Must Read
  • మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్

ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో ఉన్న పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. శుక్రవారం నగరంలో పలువురు మాజీ కార్పోరేటర్లు తమ డివిజన్లలో ఓట్లు నమోదు చేసిన పత్రాలను సేకరించి సర్దార్ రవీందర్ సింగ్‎కు అందజేశారు. ఈ సందర్భంగా సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, నవంబర్ 06 తో ఓటు నమోదు పక్రియ ముగుస్తుందని తెలిపారు. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మేధవులు త్వరగా తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉండే వారు పెద్దఎత్తున ఓట్ల నమోదులో భాగస్వామ్యం కావాలని అన్నారు. మనం వేసే ఓటే ప్రజాస్వామ్యానికి రక్షణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ ఎడ్ల అశోక్, సాదవేణి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కొత్తకొండ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS