Sunday, May 18, 2025
spot_img

కవితతో హరీష్ మూలఖత్,కారణం ఆదేనా..??

Must Read

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితని మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఉదయం కలిశారు.అనంతరం ఆరోగ్యం గురించి అడిగితెలుసుకున్నారు.దైర్యంగా ఉండాలని సూచించారు.బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న కవితకి ఊరట లభించడం లేదు.కవిత కస్టడీని జులై 05 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు.తీహార్ జైలులో ఉన్న కవితను ఇప్పటికే కేటీఆర్ రెండుసార్లు మూలాఖత్ అయ్యారు.ఇటీవల సత్యవతి రథోడ్,సబిత ఇంద్రారెడ్డి కూడా కవితతో మూలాఖత్ అయ్యారు.మార్చి 15న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తీహార్ జైలులో ఉన్న కవితను చూడడానికి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మూలఖత్ కి వెళ్లలేదు.కెసిఆర్ కవిత ని కలవకపోవడం పై అనేక సందేహాలు కలుగుతున్నాయి.ఇక ఈ రోజు కవితని కలిసిన హరీష్ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన్నట్టు తెలుస్తుంది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS