హైదరాబాద్ లో భారీగా గ*జాయి పట్టుబడింది. ఒడిశా నుండి మహారాష్ట్రకు గ*జాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 170 కిలోల గ*జాయి స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతోనే తనిఖీలు నిర్వహించి 170 కిలోల గ*జాయి స్వాధీనం చేసుకున్నామని, 08 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ తెలిపారు. మల్కాజ్గిరిలో గ*జాయిని ప్యాక్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. పట్టుబడ్డ గ*జాయి విలువ రూ.34 లక్షలు ఉంటుందని తెలిపారు.