Thursday, August 21, 2025
spot_img

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Must Read

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలుకు క్వింటాలుకి రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపక్షాలు కావాలని కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని, వడ్లు కొనుగోలు చేసిన 24 గంటల లోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని మంత్రికి రైతులు వివరించారు.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS