Tuesday, July 15, 2025
spot_img

కేంద్రం పై నిప్పులు చెరిగిన రాహుల్

Must Read

కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ ఎంపీ,ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు.అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో,దేశ ప్రజలు కూడా అదే చక్రవ్యూహంలో చిక్కుకున్నారని ఆరోపించారు.మహాభారత చక్రవ్యూహాన్ని ఆరుమంది నియత్రించారని నేటికీ కూడా 6 మంది దీనిని నియంత్రిస్తున్నారని ఆరోపించారు.నరేంద్రమోదీ,అమిత్ షా,మోహన్ భగవత్,అజిత్ దోవల్,అంబానీ,అదానీ ఉన్నారని విమర్శించారు.తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం మోదీ ప్రభుత్వం మూడు బలగాలను ఉపయోగించి దేశంలో చక్రవ్యూహం నిర్మించిందని,కేంద్రం నిర్మించిన ఈ చక్రవ్యూహం దేశప్రజలకు హానికరకంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు.కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షా నేతలపై కక్ష సాధిస్తుందని వ్యాఖ్యానించారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS