Sunday, August 17, 2025
spot_img

తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాం

Must Read

ఒలంపిక్స్ క్రీడల్లో మన దేశానికి ఎక్కువ మెడల్స్ అందించే వాళ్ళు హైదరాబాద్ నుండే ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్‎బి సమ్మిట్ లో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ప్రపంచదేశాల్లో ఐఎస్‎బి విద్యార్థులకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. ఐఎస్‎బి విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. సౌత్ కొరియా సహకారంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించామని, తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

గొప్ప నాయకులు త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, దేశంలోని గొప్ప నాయకులు.. కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం వృత్తిని, సుఖాలను, జీవితాన్ని త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఈ సంధర్బంగా గుర్తుచేశారు. గొప్ప నాయకుడిగా ఎదగాలంటే దైర్యం, త్యాగం గురించి ఆలోచించాలని, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే విజయం సాధిస్తారని తెలిపారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS