Monday, November 17, 2025
spot_img

ఆదానీ రూ.100 కోట్లను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా ఆదానీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆదానీ వ్యవహారంపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీ కోసం ఎంతోమంది నిధులు ఇచ్చారని అన్నారు. ఆదానీ సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‎బిలిటీ కింద రూ.100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లు స్వీకరించవద్దని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. నిధులను ట్రాన్స్‎ఫర్ చేయవద్దని ఆదానీ గ్రూప్‎కు లేఖ రాశామని తెలిపారు.

ఆదానీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వివాదాలకు లోనుకావడం ప్రభుత్వానికి ఇష్టంలేదని అన్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని కోరారు. ఢిల్లీ పర్యటనపై మాట్లాడుతూ, ఢిల్లీ పర్యటనకు,రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. లోక్‎సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This