Wednesday, August 20, 2025
spot_img

నేను తప్పు చేయలేదు,పోలీసులకు ప్రభాకర్ రావు లేఖ

Must Read

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎస్.ఐ.బి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు.గత నెల జూన్ 26న ఇండియాకి రావాల్సి ఉండగా,అనారోగ్య కారణాల వల్ల అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.క్యాన్సర్,గుండే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాని,వైద్యుల సూచనల మేరకు అమెరికాలోనే చికిత్స పొందుతున్నాని తెలిపారు.ఒక పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని లేఖలో వెల్లడించారు.మీడియాకు లీకులు ఇస్తూ తన పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని,తన కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.దర్యాప్తులో భాగంగా పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని,చట్టపరంగా విచారణ జరిపించాలని కోరారు.పూర్తిగా కోలుకున్నాక తానే పోలీసుల ముందు హాజరై విచారణకు సహకరిస్తానని ప్రభాకర్ రావు తెలిపారు.ఇదిలా ఉండగా ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత నెల 23న ప్రభాకర్ రావు పోలీసులకు ఈ లేఖ రాసినట్టు తెలుస్తుంది.

Latest News

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS