Thursday, June 5, 2025
spot_img

గద్దర్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Must Read

ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్బంగా అయిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ” పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా” అంటూ రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా ప్రతి ఒక్కరికి కూడు,గూడు,నీడ లభించాలనే లక్ష్యంతో జీవింతాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపర్చారని అన్నారు.

పాటకు పోరాటం నేర్పి…
తన గళంలో తూటాగా మార్చి…
అన్యాయం పై ఎక్కుపెట్టిన…
తెలంగాణ సాంస్కృతిక శిఖరం…

గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అని తెలిపారు.

Latest News

మంత్రి మెప్పుకోసం చట్టాలు, నిబంధనలకు తిలోదకాలు

నారాయణ విద్యాసంస్థలకు దాసోహం అంటున్న అధికారులు ˜ ఒక్కడి కోసం ఒకే రోజులో పరిమిషన్‌.. !˜ విద్యా వ్యవస్థలో సాధ్యం కానిది ఇప్పుడు జరిగింది..˜ ఒక ప్రత్యేక...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS