Friday, July 25, 2025
spot_img

జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను ఆకర్షిస్తుంది

Must Read
  • మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.
హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది.రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివింట్ కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది.సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.అందులో భాగంగా హైదరాబాద్ లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది.జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా (Vivint Pharma) ముందుకు రావటంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని,జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Latest News

మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేసులో సోదాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS