Friday, October 3, 2025
spot_img

హైడ్రాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ

Must Read

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి,పర్యవరణాన్నిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ తెలిపారు.చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బాలగౌని బాల్ రాజ్ గౌడ్,రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్,వర్కింగ్ చైర్మన్ యెలికట్టే విజయకుమార్ గౌడ్ లు మాట్లాడుతూ,హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కమిషనర్ రంగనాథ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా చిత్తశుద్ధితో,పకడ్బందీగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన చెరువులు,నాళాల కబ్జాల పై ప్రత్యేక విచారణ చేపట్టి,అక్రమార్కులు సంపాదించినా డబ్బును రికవరీ చేయాలనీ డిమాండ్ చేశారు.హైడ్రా పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు.మరింత సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఆక్రమణలపై కొరడా జులిపించాలని కోరారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This