Friday, October 3, 2025
spot_img

షాద్ నగర్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Must Read

షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది.

ఈ కేసును ప్రజాసంఘాల నేతలు,ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లారు.విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఘటన పై స్పందించారు.పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన అయిన బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఘటనకి బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని హెచ్చరించారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This