Thursday, February 13, 2025
spot_img

శాసనమండలిలో నా ప్రతిపక్ష హోదాను కేసీఆర్ తొలగించలేదా

Must Read

-కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

గతంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.సోమవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు.గతంలో భట్టి విక్రమార్కకి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు.శాసనమండలిలో కేసీఆర్ తన ప్రతిపక్ష నేత హోదా తొలగించలేదా? అని నిలదీశారు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో 08 చోట్ల డిపాజిట్ కోల్పోయిందని గుర్తుచేశారు.ఇప్పుడు ఆ పార్టీ ఆ నాయకులు అనర్హత వేటు గురించి మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేని బీఆర్ఎస్ పార్టీ ఖాతం అయిపోయిందని,బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఉన్న 11 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు.కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవాలని,ఆ భూమిను వేలం వేసి వచ్చిన డబ్బును రుణమాఫీకి ఉపయోగించాలని తెలిపారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అమ్మకానికి పెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

Latest News

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS