Friday, February 14, 2025
spot_img

కాంగ్రెస్ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా రాహుల్: కేసి వేణుగోపాల్

Must Read
  • మూడుగంటల పాటు కొనసాగిన సీడబ్ల్యూసి మీటింగ్
  • పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వచ్చాయి

కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసి మీటింగ్ లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తెలిపారు.ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయ్యింది.ఈ సమావేశంలో కమిటీ అనేక విషయాల పై చర్చించింది.ఆ తర్వాత కేసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల పై చర్చించినట్టు తెలిపారు.రానున్న రోజుల్లో పార్టీ కార్యాచరణ పై చర్చించామని వెల్లడించారు.మూడు గంటల పాటు సీడబ్ల్యూసి సమావేశం జరిగిందని,ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.దీని వెనుకాల అనేక మంది కార్యకర్తల కష్టం ఉందని పేర్కొన్నారు.సామజిక న్యాయం,ప్రజాస్వామ్యన్నీ రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.

Latest News

దుర్గమ్మ దారి వెంట దుర్గంధం

ఏడుపాయల్లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారీతి రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్‌ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు భరించలేక భక్తుల ఇబ్బంది ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS