Wednesday, July 16, 2025
spot_img

కాంగ్రెస్ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా రాహుల్: కేసి వేణుగోపాల్

Must Read
  • మూడుగంటల పాటు కొనసాగిన సీడబ్ల్యూసి మీటింగ్
  • పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వచ్చాయి

కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసి మీటింగ్ లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తెలిపారు.ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయ్యింది.ఈ సమావేశంలో కమిటీ అనేక విషయాల పై చర్చించింది.ఆ తర్వాత కేసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల పై చర్చించినట్టు తెలిపారు.రానున్న రోజుల్లో పార్టీ కార్యాచరణ పై చర్చించామని వెల్లడించారు.మూడు గంటల పాటు సీడబ్ల్యూసి సమావేశం జరిగిందని,ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.దీని వెనుకాల అనేక మంది కార్యకర్తల కష్టం ఉందని పేర్కొన్నారు.సామజిక న్యాయం,ప్రజాస్వామ్యన్నీ రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS