Saturday, October 4, 2025
spot_img

రేపటి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

Must Read

స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.గురువారం ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగురవేయనున్నారు.మొదటిగా ఉదయం 09 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.అక్కడి నుండి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని సైనికుల స్మారక స్థూపానికి నివాళులర్పించి,ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని జాతీయ జెండాను ఎగురవేస్తారు.అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.జెండా వందనం తర్వాత బేగంపేట విమానశ్రయం నుండి భద్రాద్రి కొత్తగూడెంకు బయల్దేరుతారు.మధ్యాహ్నం 12:50 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం చేరుకొని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫైలన్ ను ఆవిష్కరించి మీడియా సమావేశంలో పాల్గొంటారు.అనంతరం ఖమ్మం జిల్లా వైరా చేరుకొని మూడో విడత రైతు రుణమాఫీను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This