Friday, January 24, 2025
spot_img

నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించిన పలు రాష్ట్రాల సీఎంలు

Must Read

మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కేవలం మిత్రపక్షా రాష్ట్రాలకే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు.2024-25 వార్షిక బడ్జెట్ లో ఏపీ,బీహార్ రాష్ట్రాలకు కేంద్రం వరాలజల్లు కురిపించింది.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకూడని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య,హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుఖు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు.తమ పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ వెల్లడించారు.

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS